చలసాని శ్రీనివాస్కు మరోసారి కరోనా
ABN, First Publish Date - 2022-01-20T04:17:17+05:30
ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్కు మరోసారి కరోనా వచ్చింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో..
రాజమండ్రి: ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్కు మరోసారి కరోనా వచ్చింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో శ్రీనివాస్ ఏలేశ్వరం మండలం జె.అన్నవరంలో వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు. గత నెలలో కూడా ఆయనకు కరోనా సోకి హైదరాబాద్లో చికిత్స పొందారు. ఈ నెల 4న కరోనా నెగెటివ్ వచ్చింది. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే నెగెటివ్ వచ్చిన 15 రోజుల్లోనే మళ్లీ పాజిటివ్ రావడంతో చలసాని కుటుంబం ఆందోళన చెందుతోంది.
Updated Date - 2022-01-20T04:17:17+05:30 IST