మరిన్ని అప్పులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అనుమతి
ABN, First Publish Date - 2022-04-08T00:35:41+05:30
మరిన్ని అప్పులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం
ఢిల్లీ: మరిన్ని అప్పులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. విద్యుత్ సంస్కరణలను అమలు చేసినందుకు గాను 10 రాష్ట్రాలకు అదనపు అప్పులు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. రాష్ట్రంలో బోర్లకు, బావులకు వ్యవసాయ మీటర్లు బిగించినందుకు, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నజరానా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 3,716 కోట్లు అదనపు అప్పును పొందేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఈ అవకాశం కల్పించింది.
Updated Date - 2022-04-08T00:35:41+05:30 IST