ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాంట్‌ ప్రొటెక్షన్‌అధికారిపై సీబీఐ కేసు

ABN, First Publish Date - 2022-09-10T08:58:54+05:30

విశాఖలోని ప్లాంట్‌ క్వారంటైన్‌ స్టేషన్‌లో ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పదమ్‌సింగ్‌ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై కేసు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదాయానికి మించి ఆస్తులున్నాయని అభియోగం

విశాఖపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): విశాఖలోని ప్లాంట్‌ క్వారంటైన్‌ స్టేషన్‌లో ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పదమ్‌సింగ్‌ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై కేసు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  పోర్టు నుంచి జరిగే వస్తువుల దిగుమతి, ఎగుమతులకు సంబంధించి ప్లాంట్‌ క్వారంటైన్‌ స్టేషన్‌ నుంచి కస్టమ్స్‌ రిలీజ్‌ సర్టిఫికెట్‌ జారీకి పదమ్‌సింగ్‌ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు సీబీఐ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో జూలై 15న వేరొకరి నుంచి లంచం తీసుకుంటుండగా పదమ్‌సింగ్‌ను అరెస్టుచేశారు. అనంతరం ఆయన కార్యాలయం, నివాసాల్లో సోదాలు చేసిన సీబీఐ అధికారులు 2020 డిసెంబరు 2 నుంచి ఈ ఏడాది జూలై 15 వరకూ పదమ్‌సింగ్‌ రూ.1,98,22,794 విలువైన ఆస్తులను కూడగట్టినట్టు గుర్తించారు.

Updated Date - 2022-09-10T08:58:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising