జగన్ పక్కకు తప్పుకుని బీసీలకు సీఎం పదవి ఇవ్వగలరా?: Former minister యనమల
ABN, First Publish Date - 2022-05-18T01:27:44+05:30
జగన్ పక్కకు తప్పుకుని బీసీలకు సీఎం పదవి ఇవ్వగలరా?: Former minister యనమల
అమరావతి: వైసీపీ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై ఏపీ టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. జగన్ పక్కకు తప్పుకుని బీసీలకు సీఎం పదవి ఇవ్వగలరా? అంటూ ప్రశ్నించారు. వైసీపీలో రెడ్లకు పెత్తనం ఇస్తూ బీసీలను అణచివేస్తోంది జగన్ కాదా? అని యనమల అన్నారు. ఏపీని నలుగురు రెడ్లకు పంచి పెత్తనం చేయమంటున్నారని, విజయసాయి, సుబ్బారెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డికే పెత్తనం కట్టబెట్టారని ఆరోపించారు. పెత్తనం లేని పదవులే వైసీపీ బీసీలకు దక్కుతున్నాయని యనమల విమర్శించారు.
Updated Date - 2022-05-18T01:27:44+05:30 IST