ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పందెం కోళ్లకు’ బహుమతిగా బుల్లెట్ బండ్లు

ABN, First Publish Date - 2022-01-18T01:28:53+05:30

వారిద్దరూ కాసిన ప్రతీ పందెంలోనూ గెలిచి.. అత్యధిక కోడి పందేలు గెలిచిన విజేతలుగా నిలిచారు. కనీవినీ ఎరుగనంత మొత్తాన్ని సొంతం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం: వారిద్దరూ కాసిన ప్రతీ పందెంలోనూ గెలిచి.. అత్యధిక కోడి పందేలు గెలిచిన విజేతలుగా నిలిచారు. కనీవినీ ఎరుగనంత మొత్తాన్ని సొంతం చేసుకున్నారు. దీనికి గుర్తుగా పందెం బరి నిర్వాహకులు రెండు బుల్లెట్లను వారికి బహూకరించి మరింత ఆనందాన్ని నింపారు. పశ్చిమ గోదావరి జిల్లా సీసలిలో మూడు రోజులుగా కోడి పందేలు నిర్వహించారు. రెండు కేటగిరీలుగా చిన్న పందేలు, పెద్ద పందేలుగా విభజించారు. వీటిల్లో అత్యధికంగా గెలుచుకున్న కృష్ణా జిల్లా కలిదిండి, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ఇద్దరు ముందు వరుసలో నిలిచారు. ఆదివారం రాత్రి ప్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహించిన కోడి పందేల్లో.. వీరిద్దరికీ స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజు(టీడీపీ), ఆయన సోదరుడు మంతెన పెద్ద నరసింహరాజు చేతుల మీదుగా రెండు బుల్లెట్లను అందజేశారు. వీరిద్దరూ ఎమ్మెల్యే సోదరులను బైక్‌లపై ఎక్కించుకుని బరిలో రౌండ్లు వేస్తూ హల్‌చల్‌ చేశారు. వీరిద్దరు గెలిచిన పందేలను పెద్ద ఎత్తున చెప్పుకుంటున్నారు. 

Updated Date - 2022-01-18T01:28:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising