అమలాపురంలో అధికారుల బరితెగింపు
ABN, First Publish Date - 2022-03-22T15:08:30+05:30
తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో అధికారులు బరితెగించారు.
అమలాపురం: తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో అధికారులు బరితెగించారు.కామనగరువు, ఈదరపల్లి పంచాయతీల్లో ఇంటిపన్ను కట్టాలని స్థానికులకు బెదిరింపులకు గురిచేస్తున్నారు.కామనగరువు పంచాయతీలో ఆటోల ద్వారా అధికారులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. పన్నులు చెల్లించకుంటే అన్ని రకాల ప్రభుత్వ పథకాలను నిలిపివే స్తామని అధికారులు ప్రచారం చేస్తున్నారు. పన్ను బకాయిలకు సరిపడా ఆస్తులను జప్తు చేస్తామంటూ స్థానికులను అధికారులు హెచ్చరిస్తున్నారు.
Updated Date - 2022-03-22T15:08:30+05:30 IST