పాఠశాలల్లో అంగ్ల మాద్యమం ప్రభుత్వ విధానం: బొత్స
ABN, First Publish Date - 2022-07-07T17:44:53+05:30
ఉపాధ్యాయుల సంఘాలు లేవనెత్తిన సమస్యలపై వారితో చర్చించానని మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) పేర్కొన్నారు.
Amaravathi : ఉపాధ్యాయుల సంఘాలు లేవనెత్తిన సమస్యలపై వారితో చర్చించానని మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సానుకూల నిర్ణయం తీసుకుంటామని వారికి చెప్పానన్నారు. జీఓ 117లో ఉన్న అభ్యంతరాలపై సవరించిన ఉత్తర్వులు ఇస్తామన్నారు. పాఠశాలల్లో అంగ్ల మాద్యమం(English Medium) ప్రభుత్వ విధానమని... దానికి కట్టుబడి ఉన్నామని.. వెనక్కి తగ్గబోమని వెల్లడించారు. ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాలపై సంతోషంగా ఉన్నాయనే అనుకుంటున్నామని బొత్స వెల్లడించారు.
Updated Date - 2022-07-07T17:44:53+05:30 IST