ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ పాలనలో నిజమైన సామాజిక న్యాయం: GVL

ABN, First Publish Date - 2022-04-14T19:09:21+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో నిజమైన సామాజిక న్యాయం లభిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో నిజమైన సామాజిక న్యాయం లభిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. గురువారం లాడ్జి సెంటర్‌లోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులకు బీజేపీ నేతలు జి,వి.ఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీ నారాయణ పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ... దళితులకు నిజమైన గౌరవం మోదీ పాలనలోనే లభిస్తుందన్నారు. ఏపీలో దళితులకు గౌరవం లబించడం లేదని తెలిపారు. సామాజిక న్యాయం నినాదాలకే పరిమితమన్నారు. విద్యార్థులకు అందాల్సిన స్కాలర్ షిప్‌లను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని తెలిపారు. ఎస్సీ హాస్టల్స్ నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పారు. దళితులను జగన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. కేంద్రం దళితులకు ఇచ్చే నిధులన్నీ  జగన్ రెడ్డి ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఎంపీ ఆరోపించారు. దళిత విద్యార్థుల భవిష్యత్‌ను జగన్ రెడ్డి మంటగలుపుతున్నారన్నారు. దళిత విద్యార్థులకు స్కాలర్ షిప్‌లను కేంద్రమే నేరుగా అకౌంట్‌లో వేస్తోందన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిద్ర లేపుతున్నామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. 


Updated Date - 2022-04-14T19:09:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising