BJP Leader: జగన్వి అసందర్భ వ్యాఖ్యలు : విష్ణువర్ధన్ రెడ్డి
ABN, First Publish Date - 2022-07-28T18:05:36+05:30
సీఎం జగన్ వరద ప్రాంతాల పర్యటనలో అసందర్భ వ్యాఖ్యలు చేశారని...ఇది సిగ్గుచేటని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan reddy) మండిపడ్డారు.
కర్నూలు: సీఎం జగన్ వరద ప్రాంతాల పర్యటనలో అసందర్భ వ్యాఖ్యలు చేశారని... ఇది సిగ్గుచేటని బీజేపీ (BJP) నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan reddy) మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం వద్ద డబ్బులు ముద్రించే మిషన్ ఉందని సీఎం జగన్ అన్నారన్నారు. పోలవరం(Polavaram) జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని తెలిపారు. కేంద్రం ఒక రూపాయి కూడా బకాయి లేదని పార్లమెంట్లో చెబితే వైసీపీ ఎంపీలు (YCP MPs) ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేశారని, ఆదాయం వచ్చే పనులు కాంట్రాక్టర్లు చేశారని ఆరోపించారు. పోలవరం ముంపు బాధితులకు కేంద్రం ఇచ్చిన ఇల్లు ఎందుకు నిర్మించలేదని నిలదీశారు. ఊర్లు కట్టిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం పోలవరం ముంపు బాధితులకు ఇల్లు ఎందుకు నిర్మించలేదని అడిగారు. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రానికి దరిద్రమని... ఓటు బ్యాంకు రాజకీయాలు రాష్ట్రాలను గాలికొదిలేశాయని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
Updated Date - 2022-07-28T18:05:36+05:30 IST