ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: రేషన్ బియ్యం ఇవ్వకుండా జగన్ మోసం చేస్తున్నారు: సోము వీర్రాజు

ABN, First Publish Date - 2022-07-21T16:46:37+05:30

రేషన్ బియ్యం ఇవ్వకుండా జగన్ మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రేషన్ బియ్యం ఇవ్వకుండా సీఎం జగన్(Jagan) మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు (Somuveerraju) మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... పేదలకు కేంద్రం ఇచ్చిన బియ్యం జగన్ పంపిణీ చేయడం లేదన్నారు. లక్షా నలభై వేల కార్డులు జగన్ ఇష్టం వచ్చినట్లు ఇచ్చారని అన్నారు. కేంద్రం గైడ్ లైన్స్‌ను పరిగణలోకి తీసుకున్నారా అని ప్రశ్నించారు. వీరిలో యాభై లక్షల మందికి అసలు బియ్యం అవసరం లేదని తెలిపారు. వీటిని రీసైక్లింగ్ చేసి అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. కాకినాడ కేంద్రం గా బియ్యం అక్రమ రవాణా సాగుతుందని, ఇతర దేశానికి ఇక్కడ నుంచే  భారీగా వెళుతుందని చెప్పడం విశేషమన్నారు. బియ్యం కుంభకోణంపై వాస్తవాలు ప్రజలకు‌ వివరిస్తామని చెప్పారు. పేదలు తినే బియ్యాన్ని పందికొక్కుల్లా తింటారా అంటూ వ్యాఖ్యలు చేశారు. వీటి వెనుక ఉన్న అందరి‌ బాగోతాలు బయట పెడతామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి చెప్పినా జగన్ ప్రభుత్వం స్పందించదా అని సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-21T16:46:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising