మంత్రి అంబటి రాంబాబుకు Somuveerraju స్ట్రాంగ్ కౌంటర్
ABN, First Publish Date - 2022-06-04T19:58:41+05:30
జలవనరుల మంత్రి అంబటి రాంబాబుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అమరావతి: జలవనరుల మంత్రి అంబటి రాంబాబుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నెల్లూరు...ట్వీట్లు కాదు డైరెక్ట్గా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వం ఒక కాంట్రాక్టర్ను పెట్టుకున్నారని, వైసీపీ వచ్చాక తమరు ఒక కాంట్రాక్టర్ను పెట్టుకున్నారని తెలిపారు. రూ.55 వేలు కోట్లు ఏవిధంగా అడుగుతారో సమాధానం చెప్పాలన్నారు. ‘‘గతంలో మీ పార్టీ ఏం మాట్లాడిందో తెలుసుకోండి. ఇప్పుడు మీరే కడుతున్నారు కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీదే’’ అని తెలిపారు. హైడల్ పవర్ ప్రాజెక్టు కడతానన్నారు ఏమైందో మంత్రి అంబటి రాంబాబు సమాధానం చెప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు.
Updated Date - 2022-06-04T19:58:41+05:30 IST