Somuveerraju: అమరావతి రైతులతో సోమువీర్రాజు భేటీ
ABN, First Publish Date - 2022-08-29T16:52:46+05:30
అమరావతి రైతులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు సోమవారం ఉదయం భేటీ అయ్యారు.
అమరావతి: అమరావతి రైతుల (Farmers of Amaravati)తో బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు (Somu veerraju) సోమవారం ఉదయం భేటీ అయ్యారు. బీజేపీ తరపున తమకు అండగా ఉన్నారంటూ సోమువీర్రాజు (BJP state presidents)కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు (Farmers) పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆహ్వానించారు. అమరావతి రాజధాని కోసం బీజేపీ పని చేస్తోందని ఈ సందర్భంగా సోము వీర్రాజు స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి అన్ని విధాలా కేంద్రం సహకరిస్తుందని సోము వీర్రాజు హామీ ఇచ్చారు.
Updated Date - 2022-08-29T16:52:46+05:30 IST