ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ చూస్తూ ఊరుకోదు... వైసీపీ పాలనను ఎండగడతాం: Yamini

ABN, First Publish Date - 2022-06-29T17:19:18+05:30

ప్రజల డబ్బులు జీతంగా తీసుకుంటూ వైసీపీ నాయకులకు వలంటీర్లు పనిచేస్తున్నారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామినీ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రజల డబ్బులు జీతంగా తీసుకుంటూ వైసీపీ నాయకులకు వలంటీర్లు పనిచేస్తున్నారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామినీ(Sadhineni yamini) శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యేలకు తొత్తులుగా వలంటీర్లు మారుతున్నారన్నారు. వలంటరీ వ్యవస్థ అంటే గుడాచారి వ్యవస్థ అని అన్నారు. వైసీపీ కార్యకర్తలకు వలంటరీ పోస్టులు ఇచ్చామని స్వయంగా హోంమంత్రి చెబుతున్నారన్నారు. ఆత్మకూరులో వలంటరీలతో డబ్బులు పంచారని తెలిపారు. తప్పు చేస్తున్నారు అని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా ముందే భౌతిక దాడులకు దిగుతున్నారన్నారు. తీవ్రవాదుల పాలన రాష్ట్రంలో సాగుతోందని విమర్శించారు. బీజేపీ చూస్తూ ఊరుకోదని... వైసీపీ పాలనను ఎండగడతామని యామిని స్పష్టం చేశారు. 


Updated Date - 2022-06-29T17:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising