ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ దౌర్జన్యాలను, అవినీతిని ప్రశ్నించడమే Ayyanna చేసిన నేరమా?:Ravichandra

ABN, First Publish Date - 2022-06-19T18:27:11+05:30

బీసీ నేతలంటే వైసీపీ ప్రభుత్వానికి ద్వేషమెందుకని టీడీపీ నేత బీద రవిచంద్ర ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: బీసీ (BC) నేతలంటే వైసీపీ (YCP) ప్రభుత్వానికి ద్వేషమెందుకు?.. వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాలను, అవినీతిని ప్రశ్నించడమే అయ్యన్న పాత్రుడు (Ayyanna patrudu) చేసిన నేరమా? అని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి బీద రవిచంద్ర (Beeda Ravichandra) ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 


బీసీ నేత అయ్యన్న పాత్రుడు గొంతు నొక్కేందుకు వైసీపీ ప్రభుత్వం గత మూడేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోందని విమర్శించారు.


 అయ్యన్నను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా దొడ్డి దారిన దాడులకు వైసీపీ ప్రభుత్వం ఉపక్రమిస్తోందని,


 సర్కార్ తప్పిదాలను, దౌర్జన్యాలను ప్రశ్నించే హక్కు బీసీ నేతలకు లేదా? అంటూ నిలదీశారు. 


వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించిన పాపానికి అయ్యన్న పాత్రుడు ఇంటి విద్యుత్ సరఫరాను నిలిపివేసి, తెల్లవారు జామున గోడ కూల్చివేశారని బీద రవిచంద్ర మండిపడ్డారు. 


కూల్చడమే తప్ప నిర్మించడం ఎరుగని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. మూడేళ్లపాలనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి ఆస్తులను ధ్వంసం చేయడం తప్ప.. వైసీపీ సర్కార్ అభివృద్ధి చేసింది శూన్యమన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, బుద్ది చెప్పేందుకు తగిన సమయం కోసం వేచి ఉన్నారని బీద రవిచంద్ర అన్నారు.

Updated Date - 2022-06-19T18:27:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising