ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

JAGAN: డబ్బులు సంపాదించాలన్న ధ్యాస తప్ప మరోటి లేదు: అయ్యన్నపాత్రుడు

ABN, First Publish Date - 2022-07-22T23:37:37+05:30

జగన్ ఒక వ్యాపారస్తుడు.. ఆయనకు డబ్బులు సంపాదించాలన్న ధ్యాస తప్ప మరొకటి లేదని తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: జగన్(JAGAN) ఒక వ్యాపారస్తుడు.. ఆయనకు డబ్బులు సంపాదించాలన్న ధ్యాస తప్ప మరొకటి లేదని తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు(ayyannapatrudu) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... పాఠశాలల విలీనం తుగ్లక్ చర్య అన్నారు. 117 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముఖ్యమంత్రి ఆటలాడడం తగదని హెచ్చరించారు. విద్యార్థుల ఉత్తీర్ణత పెరిగితే జగన్ గొప్పదనం.. స్టూడెంట్స్ ఫెయిల్ అయితే ఉపాధ్యాయుల వైఫల్యమా? అని ప్రశ్నించారు. విద్యార్థుల సంఖ్య తగ్గితే మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, బ్యాగ్స్, టీచర్స్ నియామకాలు, ప్రోమోషన్స్ ఉండవు.. అందుకే పాఠశాలల విలీనం నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాకానుక ఇప్పటికి 80 శాతం విద్యార్థులకు అందలేదన్నారు.జగన్ అన్నివర్గాల ప్రజలను మోసం చేశారు.. ఆఖరికి పిల్లలను కూడా మోసం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్‌‌రెడ్డికి ఆలోచించే శక్తి లేదు.. మీరైన విద్యారంగాన్ని మెరుగు పరచాలని మంత్రి బొత్స సత్యనారయణ(Botsa Satyanarayana)కి సలహా ఇచ్చారు. వర్షాకాలంలో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదని  అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.

Updated Date - 2022-07-22T23:37:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising