ఆత్మకూరు ఉపఎన్నికకు పటిష్ట భద్రత: SP vijayarao
ABN, First Publish Date - 2022-06-22T18:48:56+05:30
ఆత్మకూరు ఉపఎన్నికకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ విజయరావు తెలిపారు.
నెల్లూరు: ఆత్మకూరు ఉపఎన్నికకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ విజయరావు(Vijayarao) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 38 సెక్టార్లకు రూట్ మొబైల్ టీంలు ఉంటాయని, మండలానికో స్ట్రైకింగ్ ఫోర్స్ తిరుగుతుందని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వద్ద సాయుధ బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని అన్నారు. బాడీ ఓన్ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. అన్ని చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశామని అన్నారు. ఇప్పటి వరకూ రూ.47 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకొన్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విజయరావు హెచ్చరించారు.
Updated Date - 2022-06-22T18:48:56+05:30 IST