ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Atchennaidu: వారికి టీడీపీ అన్ని విధాల అండగా ఉంటుంది...

ABN, First Publish Date - 2022-08-28T17:41:17+05:30

సీఎం జగన్ ప్రతిపక్ష నేతల్ని కార్యకర్తల్ని వేదిస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): సీఎం జగన్ రెడ్డి (CM Jagan) వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని ప్రతిపక్ష నేతల్ని కార్యకర్తల్ని వేదిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchennaidu) మండిపడ్డారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మూడేళ్లలో ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టారో, ఎంతమందిని జైళ్ళకు పంపారో లెక్కేలేదన్నారు. వైసీపీ (YCP) పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తలకు నాయకులకు టీడీపీ (TDP) అన్ని విధాల అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కొంతమంది పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కయి అక్రమ కేసులు, అర్థరాత్రి అరెస్టులు, థర్డ్ డిగ్రిలతో  టీడీపీ కార్యకర్తల్ని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం పోలీసులు డ్యూటీలో భాగం అనుకుంటున్నారా?.. లేక ఫ్యాషన్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. పోలీసులు ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిదన్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసుల చిట్టా తయారు చేస్తున్నామన్నారు. తమ కార్యకర్తల కన్నీళ్లకు కారణమైన ఖాకీలను, వైసీపీ నేతల్ని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజే వారిపై చర్యలకు శ్రీకారం చుడతామన్నారు. 2024 తర్వాత ఏపీ రాష్ట్రంలో వైసీపీ ఉండదని, జగన్ రెడ్డి ఉండరని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated Date - 2022-08-28T17:41:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising