ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ అవినీతి లేకపోతే 30 శాతం పీఆర్సీ ఇవ్వొచ్చు: అశోక్‌బాబు

ABN, First Publish Date - 2022-02-08T20:46:44+05:30

ఉద్యోగుల ఉద్యమం వెనుక టీడీపీ ఉందని సీఎం జగన్ మాట్లాడటం దిగజారుడు తనమని అశోక్ బాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఉద్యోగుల ఉద్యమం వెనుక టీడీపీ ఉందని  సీఎం జగన్ మాట్లాడటం దిగజారుడు తనమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉద్యోగ సంఘాల నాయకుల్ని బ్లాక్ మెయిల్ చేసి ఉద్యమాన్ని నీరుగార్చారని విమర్శించారు. నాయకులు స్వార్దం కోసం ఉద్యోగస్తుల్ని మోసం చేయబట్టే.. ఆ జేఏసీల్లో నుంచి ఉద్యోగులంతా బయటకొచ్చి కొత్త జేఏసీలతో ఉద్యమానికి సిద్దమవుతున్నారన్నారు. ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చమంటే..  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదనటం పచ్చి అబద్దమన్నారు. 2021 డిసెంబర్ నాటికే రూ. 97 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, మార్చి నాటికి రూ. 1 లక్షా 32 వేల కోట్లకు పెరుగుతుందన్నారు. కోవిడ్ సమయంలో రాష్ట్ర ఆదాయం పెరిగిందే తప్ప తగ్గలేదన్నారు. నాడు, నేడు, వైసీపీ రంగులు, ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని, ఈ అవినీతి లేకపోతే 30 శాతం పీఆర్సీ ఇవ్వొచ్చునన్నారు. జగన్ ఉద్యోగులకు చేసిన  మోసానికి వాళ్లు  రిటర్న్ గిప్ట్ ఇవ్వటం ఖాయమన్నారు.‎ ఉద్యోగుల న్యాయబద్ద పోరాటానికి టీడీపీ అండగా ఉటుందని అశోక్ బాబు స్పష్టం చేశారు.

Updated Date - 2022-02-08T20:46:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising