AP News: కృష్ణా జిల్లాలో జనసేన నేతల అరెస్ట్
ABN, First Publish Date - 2022-09-29T17:07:48+05:30
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం బంటుమిల్లిలో జనసేన నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
విజయవాడ: కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం బంటుమిల్లిలో జనసేన నేతల (Janasena leaders)ను పోలీసులు అరెస్టు చేశారు. 30 పడకల ప్రభుత్వ హాస్పటల్లో సరైన వసతులు లేవంటూ జనసేన నేతలు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా వేదిక ఏర్పాటు చేసుకుని జనసేన నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. విషయం తెలిసిన పోలీసులు దీక్షా వేదిక వద్దకు చేరుకుని... దీక్షకు అనుమతి లేదంటూ వాగ్వాదానికి దిగారు. సమస్యలు పరిష్కారంపై అధికారులు హామీ ఇవ్వాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. కాగా... జనసేన సైనికులను అరెస్టు చేసిన పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు. జనసేన ప్లెక్సీలు, వేదికను తొలగించారు. పోలీసుల తీరుపై జనసేన నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ (YCP) కార్యక్రమాలకే రక్షణ ఉండే పోలీసులు... విపక్ష పార్టీల కార్యక్రమాలను అడ్డుకోవడం దుర్మార్గం అంటూ జన సైనికులు మండిపడుతున్నారు.
Updated Date - 2022-09-29T17:07:48+05:30 IST