ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్ 4.. ఏపీలో చరిత్రాత్మకమైన రోజు: ఎమ్మెల్యే గుడివాడ

ABN, First Publish Date - 2022-04-04T23:35:57+05:30

ఏపీలో 26 జిల్లాలు అవతరించిన ఏప్రిల్ 4 చరిత్రాత్మకమైన రోజని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఏపీలో 26 జిల్లాలు అవతరించిన ఏప్రిల్ 4 చరిత్రాత్మకమైన రోజని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. మీడయాతో ఆయన మాట్లాడారు.  సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాల సంఖ్యను పెంచారన్నారు. కానీ టీడీపీ నాయకుడు చంద్రబాబు మాత్రం బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ జిల్లా ఎందుకు ఏర్పాటు చేయలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాల సంఖ్యపై జనసేన పవన్ కళ్యాణ్, సీపీఐ రామకృష్ణ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. చంద్రబాబుకి పవన్ రబ్బర్‌స్టాంపుగా మారారని ఆయన ఆరోపించారు. పవన్ గబ్బర్‌సింగ్ కాదని, రబ్బర్‌సింగ్ అని ఆయన ఎద్దేవా చేశారు. మధురవాడలో 97 ఎకారాల భూవ్యవహారంపై అమర్‌నాధ్ దాటవేత ధోరణి ప్రదర్శించారు. భూ వ్యవహారంలో వైసీపీ కీలకనేత ఎవరన్న ప్రశ్నకు అమర్ నీళ్లు నమిలారు. జీఆర్పీఎల్ కంపెనీ ఎవరిదో కూడా తనకు తెలీదని ఆయన సమాధానం ఇచ్చారు. 



Updated Date - 2022-04-04T23:35:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising