ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ నాయకత్వం వర్ధిల్లాలంటూ ప్రభుత్వ ఆస్తులపై నినాదాలు

ABN, First Publish Date - 2022-03-23T08:39:11+05:30

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై నమోదైన ఓ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 13 ఏళ్లపాటు కోర్టుకు హాజరు 

తిరుపతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై నమోదైన ఓ కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు(విజయవాడ) కొట్టివేసింది. ‘వైఎస్‌ జగన్‌ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ ప్రభుత్వ ఆస్తులపై నినాదాలు రాశారనే అభియోగంతో 2009లో చెవిరెడ్డిపై రేణిగుంట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి 13 ఏళ్లపాటు ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ విచారణకు చెవిరెడ్డి క్రమం తప్పకుండా హాజరయ్యారు. ఆయన తరఫున న్యాయవాదులు పి. సురేశ్‌బాబు, సీబీ మధుకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా, మంగళవారం జరిగిన విచారణలో ప్రత్యేక కోర్టు ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. మరోవైపు, కడప, రాజంపేట, రైల్వేకోడూరు తదితర ప్రాంతాల్లో మరికొందరిపై నమోదైన ఇదే తరహా కేసుల విచారణ కొనసాగుతోంది. 

Updated Date - 2022-03-23T08:39:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising