తీర్పు వచ్చినా మూడు రాజధానుల పాటేనా!: శైలజానాథ్
ABN, First Publish Date - 2022-03-05T08:09:35+05:30
‘‘రాజధాని అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయినా మంత్రులు 3రాజధానుల..
నెల్లూరు వైద్యం, వేంపల్లె, మార్చి 4: ‘‘రాజధాని అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయినా మంత్రులు 3రాజధానుల పాటే పాడుతున్నారు. జంబో సలహాదారుల మాటలు విని సుప్రీం కోర్టుకు వెళ్లకండి. ప్రజాధనం దుర్వినియోగం చేయకండి’’ అని పీసీసీ చీఫ్ శైలజానాథ్ సలహా ఇచ్చారు. ఉత్తరాంధ్రలో మంత్రులు భూములు ఆక్రమించుకున్నారని, అందువల్లే కోర్టు తీర్పును సైతం వ్యతిరేకించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాగా, అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ పట్టింపులకు పోకుండా హైకోర్టు తీర్పును అమలు చేయాలన్నారు.
Updated Date - 2022-03-05T08:09:35+05:30 IST