ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరగనున్న ఎండలు తగ్గనున్న చలి ప్రభావం

ABN, First Publish Date - 2022-02-19T08:44:02+05:30

శీతాకాలం చివరి దశకు చేరడంతో చలి ప్రభావం తగ్గి వచ్చే వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): శీతాకాలం చివరి దశకు చేరడంతో చలి ప్రభావం తగ్గి వచ్చే వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో పగటిపూట ఎండలు కూడా పెరుగుతాయని పేర్కొంది. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు వాతావరణ మార్పులపై ఐఎండీ బులెటిన్‌ విడుదల చేసింది. ఉత్తరాదిలో వర్షాలు తగ్గుతాయని, అదే సమయంలో కనీస ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించింది. కాగా, రాష్ట్రంలో శుక్రవారం పలుచోట్ల మంచు కురిసింది. ఉదయం 8గంటల వరకు మంచు ప్రభావం కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం ఎక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం కర్నూలులో 33.7 డిగ్రీల గరిష్ఠ, ఆరోగ్యవరంలో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - 2022-02-19T08:44:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising