ఫిట్మెంట్ తగ్గితే ఉద్యోగులు ఎలా సమర్ధిస్తారు?: Sailajanath
ABN, First Publish Date - 2022-01-08T19:13:16+05:30
పీఆర్సీ అంశంలో సీఎం జగన్ ఉద్యోగులను మోసం చేశారని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ మండిపడ్డారు.
విజయవాడ: పీఆర్సీ అంశంలో సీఎం జగన్ ఉద్యోగులను మోసం చేశారని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ జగన్ నిర్ణయాలు ఉద్యోగ సంఘాల నేతలకు మాత్రమే నచ్చాయన్నారు. 20 శాతం ఫిట్మెంట్ తగ్గితే ఉద్యోగులు ఎలా సమర్ధిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం హెచ్ఆర్ఏపై స్పష్టత ఇవ్వలేదన్నారు. లక్షల జీతాలు తీసుకునే సలహాదారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. స్వచ్చంద ఓటీస్ పేరుతో ప్రజలను భయపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను ఆపేస్తామని వాలంటీర్లతో బెదిరిస్తున్నది వాస్తవం కాదా? అని అడిగారు. బయటకు వచ్చి వాస్తవాలు చెప్పలేని దుస్థితిలో వైసీపీ మంత్రులున్నారని శైలజానాథ్ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2022-01-08T19:13:16+05:30 IST