ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడప గడపకు ప్రభుత్వం పేరుతో మరో మోసం: Sailajanth

ABN, First Publish Date - 2022-05-21T18:49:53+05:30

గడప గడపకు ప్రభుత్వం పేరుతో వైసీపీ సర్కార్ మరో మోసానికి పాల్పడుతోందని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గడప గడపకు ప్రభుత్వం పేరుతో వైసీపీ సర్కార్ మరో మోసానికి పాల్పడుతోందని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... బస్సుయాత్ర ద్వారా ప్రజలకు ఏం అభివృద్ధి చేసారని చెబుతారని ప్రశ్నించారు. దావోస్ సదస్సు పేరుతో ప్రజాధనం వృధా అంటూ మండిపడ్డారు. దావోస్ పర్యటన అని చెప్పి లండన్ పర్యటన ఆంతర్యం ఏమిటి అని నిలదీశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ద్రోహం, ధగా చేస్తోందని విమర్శించారు. పేరుకు పదవులు ఇచ్చి, వారికి పవర్ లేకుండా రబ్బరు స్టాంపులుగా మార్చిందని అన్నారు. దావోస్‌కని చెప్పి లండన్ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన పర్యటన వివరాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ స్వంత విహారయాత్రల కోసం వెళుతూ ప్రజా ధనాన్ని జగన్ రెడ్డి వృధా చేస్తున్నారని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-05-21T18:49:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising