AP: జీతాలు, పెన్షన్ల బిల్లుల ప్రక్రియపై మరోసారి ఆర్థికశాఖ సర్క్యూలర్
ABN, First Publish Date - 2022-01-27T20:37:47+05:30
అమరావతి: జీతాలు, పెన్షన్ల బిల్లుల ప్రక్రియపై ఆర్థిక శాఖ మరోసారి సర్క్యూలర్ జారీ చేసింది.
అమరావతి: జీతాలు, పెన్షన్ల బిల్లుల ప్రక్రియపై ఆర్థిక శాఖ మరోసారి సర్క్యూలర్ జారీ చేసింది. కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు, పెన్షన్ల బిల్లులు ప్రాసెస్ చేయాలని సూచించింది. సర్క్యూలర్ ప్రకారం నిర్దేశిత గడువులోగా.. జీతాలు, పెన్షన్ల బిల్లులు ప్రాసెస్ చేయకుంటే చర్యలు తప్పవని డీడీవోలు, పీఏఓలు, ట్రెజరీ అధికారులకు హెచ్చరికాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ కల్లా జీతాలు జమయ్యేలా చూడాలని ట్రెజరీకి ప్రభుత్వం ఆదేశించింది.
ప్రభుత్వంతో ఉద్యోగుల సంఘాల నేతలు జరిపిన చర్చలు ఫలించకపోవడంతో పీఆర్సీపై ఆందోళనలు కొనసాగుతోన్నాయి. పీఆర్సీ సాధన ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఉద్యోగులు నాలుగు రోజుల పాటు స్థానిక ఏపీఎన్జీవో హోం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్లో రిలే దీక్షలో రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. దీక్షకు మద్దతుగా జిల్లాల నలుమూలల నుంచి ఉద్యోగులు తరలి వచ్చారు.
Updated Date - 2022-01-27T20:37:47+05:30 IST