ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమవుతున్న టీడీపీ

ABN, First Publish Date - 2022-08-13T08:54:35+05:30

పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమవుతున్న టీడీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరులో భూమి పూజ... జెండా పండుగకు రానున్న బాబు


గుంటూరు(తూర్పు), ఆగస్టు 12: ఆజాదీ కా అమృతోత్సవ్‌ కార్యక్రమాల నేపథ్యంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను టీడీపీ స్థానిక చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఇతర ముఖ్యనేతలు హజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన ప్రాంగణంలో శుక్రవారం టీడీపీ సీనియర్‌ నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజా, గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ ఇతర ముఖ్యనేతలు భూమి పూజ చేశారు. అనంతరం ప్రాంగణాన్ని పరిశీలించారు. గడ్డి, ఇతర వ్యర్థాలను పూర్తిగా తొలగించి, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. వేడుకలకు హజరయ్యే టీడీపీ నాయకులకు, ప్రజలకు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకలకు హజరయ్యే కార్యకర్తలు జాతీయ జెండాలు మాత్రమే తీసుకురావాలని, పార్టీ జెండాను తీసుకురావడం గాని, వాహనాలకు ఏర్పాటు చేయడంగానీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తొలిసారిగా ప్రజల మధ్యన నిర్వహిస్తున్నందున కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నాయకులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-08-13T08:54:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising