ఏపీలో ఎమ్మెల్సీ బై ఎలక్షన్కు షెడ్యూల్ విడుదల
ABN, First Publish Date - 2022-03-01T00:14:33+05:30
ఏపీలో ఎమ్మెల్సీ బై ఎలక్షన్కు షెడ్యూల్ విడుదల
అమరావతి: ఏపీలో ఎమ్మెల్సీ బై ఎలక్షన్కు షెడ్యూల్ విడుదలైంది. మహమ్మద్ కరీమున్నిసా మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సి స్ధానానికి షెడ్యూల్ ను విడుదల చేశారు. మార్చి 7న నోటిఫికేషన్ జారీ కానుంది. అలాగే నామినేషన్లకు ఆఖరు తేదీ మార్చి 14 నిర్ణయించారు. మార్చి 15న నామినేషన్ల పరిశీలన జరగనుంది. మార్చి 17న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు. అలాగే మార్చి 24న పోలింగ్, అనంతరం అదేరోజు కౌంటింగ్ జరగనుంది. మార్చి 28 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని షెడ్యూల్ విడుదలైంది.
Updated Date - 2022-03-01T00:14:33+05:30 IST