AP News : భర్తే హత్య చేశాడు.. మృతురాలి కుటుంబసభ్యుల ఆరోపణ
ABN, First Publish Date - 2022-07-31T22:34:16+05:30
కర్నూలు: కర్నూలు నగరం వీఆర్ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కుటుంబ కలహాలతో ఈనెల 28న నాగమణి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యలు ఆమెను వీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే వైద్యులు చికిత్స మొదలుపెట్టారు.
కర్నూలు: కర్నూలు (Kurnool) నగరం వీఆర్ ఆస్పత్రి (VR Hospital) దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కుటుంబ కలహాలతో ఈనెల 28న నాగమణి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యలు ఆమెను వీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే వైద్యులు చికిత్స మొదలుపెట్టారు. కాగా నాగమణి ఈ నెల 29న చికిత్స పొందుతూ చనిపోయారు. నాగమణి మృతదేహానికి మూడు రోజులైనా పోస్టుమార్టం నిర్వహించకపోవడంతో బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. నాగమణిని ఆమె భర్త సతీష్ హత్య చేశాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులతో మృతురాలి బంధువుల వాగ్వాదానికి దిగారు.
Updated Date - 2022-07-31T22:34:16+05:30 IST