ఎన్టీఆర్భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
ABN, First Publish Date - 2022-07-05T01:04:10+05:30
జిల్లాలోని సత్తెనపల్లిలో కోడెల శివరామ్ ఆధ్వర్యంలో రైతు పోరు ర్యాలీ చేపట్టారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ ఎన్టీఆర్భవన్ దగ్గర వారిని పోలీసులు అడ్డుకున్నారు.
పల్నాడు: జిల్లాలోని సత్తెనపల్లిలో కోడెల శివరామ్ ఆధ్వర్యంలో రైతు పోరు ర్యాలీ చేపట్టారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ ఎన్టీఆర్భవన్ దగ్గర వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులతో రైతులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతు గెలవాలి.. వ్యవసాయం నిలవాలి అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్భవన్ దగ్గర పోలీసుల భారీగా మోహరించారు. అలాగే ముప్పాళ్ళలో ర్యాలీకి బయలుదేరిన ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు.
Updated Date - 2022-07-05T01:04:10+05:30 IST