స్నేహితుడి భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం
ABN, First Publish Date - 2022-06-24T01:55:16+05:30
జిల్లాలోని లింగసముద్రం మండలం చినపవనిలో దారుణఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియోతో బెదిరించి...
నెల్లూరు: జిల్లాలోని లింగసముద్రం మండలం చినపవనిలో దారుణఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియోతో బెదిరించి వివాహితపై పలుమార్లు స్నేహితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అవమానంతో పురుగుల మందుతాగి దంపతుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమ చావుకు ఇలియాజ్ కారణమంటూ దంపతుల సెల్ఫీ వీడియోలో మాట్లాడారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2022-06-24T01:55:16+05:30 IST