ఆదాయాలను సమకూరుస్తున్న శాఖల సమీక్షపై జగన్ వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2022-10-06T22:28:55+05:30
ఆదాయాలను సమకూరుస్తున్న శాఖల సమీక్షపై జగన్ వ్యాఖ్యలు
అమరావతి: ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఏపీ ఆదాయ వనరులు గాడిలో పడ్డాయని సీఎం అన్నారు. దేశ సగటుతో పోలిస్తే ఏపీలో అధికంగా జీఎస్టీ సగటు వసూళ్లు చేస్తున్నారని చెప్పారు. పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. రవాణా శాఖలో ఆదాయాల పెంపుపై చర్యలు తీసుకోవాలన్నారు.
Updated Date - 2022-10-06T22:28:55+05:30 IST