‘పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదని...’
ABN, First Publish Date - 2022-08-07T22:13:31+05:30
‘పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదని...’
ప్రకాశం: జిల్లాలోని పుల్లలచెరువు మండలం గారపెంటలో విషాదఘటన చోటుచేసుకుంది. పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదని బావ మరదలు అడవిలో ముష్టి ఆకులు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మరదలు బొజ్జ పుష్పావతి (19) మృతి చెందగా, బావ సావుడి వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం ఎర్రగొండపాలెం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Updated Date - 2022-08-07T22:13:31+05:30 IST