చెట్ల నరికివేత ఘటనపై చంద్రబాబు స్పందన
ABN, First Publish Date - 2022-12-06T21:03:36+05:30
అన్నమయ్య జిల్లాలో చెట్ల నరికివేత ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అమరావతి: అన్నమయ్య జిల్లాలో చెట్ల నరికివేత ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. దళిత మహిళ పొలంలో చెట్ల నరికివేత సైకో చర్యే అని పేర్కొన్నారు. వైసీపీ నేతలు తాము ఏం చేసినా తమకేమీ కాదనే అహంకారమే.. ఇలాంటి దారుణాలకు కారణమని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలిపోయిన సీఎం కటౌట్కు పోలీసులు ఇచ్చే ప్రాధాన్యం.. దళిత వర్గాలకు ఇవ్వకపోవడం విచారకరమన్నారు.
Updated Date - 2022-12-06T21:03:38+05:30 IST