AP high courtలో యోగా దినోత్సవ వేడుకలు
ABN, First Publish Date - 2022-06-21T13:56:08+05:30
రాష్ట్ర హైకోర్టులో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
అమరావతి: రాష్ట్ర హైకోర్టులో అంతర్జాతీయ యోగా(Yoga) దినోత్సవ వేడుకలను నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా(Prashant Kumar Mishra) అధ్యక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రధానినరేంద్ర మోదీ(Narendra modi) మైసూరు పాలెస్ నుండి ఇచ్చిన సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన అనంతరం యోగా మాస్టర్ సూచనలను అనుసరిస్తూ యోగా అభ్యాసాలను చేస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకిరామి రెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంటా రామారావు, హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్.హరనాధ్ రెడ్డి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, హైకోర్టు సిబ్బంది...యోగా అభ్యాసాలు చేశారు.
Updated Date - 2022-06-21T13:56:08+05:30 IST