ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: హైకోర్టు నూతన జడ్జిల ప్రమాణ స్వీకారం

ABN, First Publish Date - 2022-08-04T17:27:16+05:30

ఏపీ హైకోర్టు (AP High Court)కు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ హైకోర్టు (AP High Court)కు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ (Vijayawada)లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో న్యాయమూర్తులుగా నియమితులైన అడుసుమల్లి వెంకటరవీంద్రబాబు, దుప్పల వెంకటరమరణ, బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌, బండారు శ్యామ్‌ సుందర్‌, ఊటుకూరు శ్రీనివాస్‌, తల్లాప్రగడ మల్లికార్జునరావులతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ (Governor Biswabhusan Harichandan) ప్రమాణం చేయించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా మాతృమూర్తి మరణించడంతో ఆయన కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. అందువల్ల కొత్త న్యాయమూర్తులతో గవర్నర్‌ ప్రమాణం చేయించారు. 


న్యాయాధికారుల కోటాలో అడుసుమల్లి వెంకటరవీంద్రబాబు, దుప్పల వెంకటరమరణ, బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌, బండారు శ్యామ్‌ సుందర్‌, ఊటుకూరు శ్రీనివాస్‌, తల్లాప్రగడ మల్లికార్జునరావులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని గత నెల 20న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. వీరిలో రవీంద్రబాబు, కృపాసాగర్‌, శ్యామ్‌సుందర్‌, శ్రీనివాస్‌ శాశ్వత న్యా యమూర్తులుగా.. వెంకటరమణ, చక్రవర్తి, మల్లికార్జునరావు రెండేళ్లు అదనపు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారని కేంద్రన్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Updated Date - 2022-08-04T17:27:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising