ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రఘురామపై సీఐడీ కేసు... విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి

ABN, First Publish Date - 2022-06-29T22:31:10+05:30

ఎంపీ రఘురామపై నమోదైన సీఐడీ కేసులో విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. తనపై కేసులను కొట్టివేయాలని హైకోర్టులో రఘురామరాజు పిటిషన్‌ దాఖలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎంపీ రఘురామపై నమోదైన సీఐడీ కేసులో విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. తనపై కేసులను కొట్టివేయాలని హైకోర్టులో రఘురామరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. ఎంపీ రఘురామరాజును రాజద్రోహం నేరం మినహా మిగతా సెక్షన్‌ల కింద విచారించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌ దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో లాయర్‌ సమక్షంలో విచారించాలని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారణ చేయాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన అంశాలు మినహా ఏ ఇతర అంశాలపై పిటిషనర్‌ను ప్రశ్నించకూడదని హైకోర్టు పేర్కొంది. అలాగే సీఐడీ కార్యాలయాలకు పిలిపించవద్దని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అంతా లాయర్‌ సమక్షంలోనే జరగాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే బాధ్యులైన పోలీస్‌ అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఏపీ హైకోర్టు పేర్కొంది. 

Updated Date - 2022-06-29T22:31:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising