AP governmentపై కళా వెంకట్రావ్ మండిపాటు
ABN, First Publish Date - 2022-05-20T02:22:49+05:30
రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత కళా వెంకట్రావ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బూతులు మాట్లాడేవారు
విజయనగరం: రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత కళా వెంకట్రావ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బూతులు మాట్లాడేవారు, ఇసుక అక్రమ దందా చేసేవారు, పేకాట ఆడించేవారే జగన్ మంత్రివర్గంలో ఉన్నారని విమర్శించారు. నలుగురు మంత్రులతో బస్సు యాత్రలు చేస్తే సామాజిక న్యాయం జరగదన్నారు. సెల్ఫోన్లో మెసేజ్ పెడితేనే పీఎస్లో పెట్టి చావగొట్టేవారని, సామాజిక న్యాయమని జనంలోకి ఎలా వెళ్తారు? అని కళా వెంకట్రావ్ ప్రశ్నించారు.
Updated Date - 2022-05-20T02:22:49+05:30 IST