TDP MAHANADU: జగన్కు ఈ రోజు పిచ్చెక్కుతుంది.. నిద్ర కూడా పట్టదు: Chandrababu
ABN, First Publish Date - 2022-05-29T00:47:57+05:30
ఏ మహానాడులోనూ ఒంగోలు మహానాడులో ఉన్నంత కసి చూడలేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉన్మాదుల పాలన...
ఒంగోలు: ఏ మహానాడులోనూ ఒంగోలు (Ongole) మహానాడులో ఉన్నంత కసి చూడలేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. ఉన్మాదుల పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని కార్యకర్తలు తరలివచ్చారని ఆయన తెలిపారు. టీడీపీకి జనాలు ఉన్నారని.. వైసీపీకి బస్సులున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అధికారం పోతే ఆ బస్సులు కూడా వైసీపీకి ఉండవన్నారు. మహానాడును అడ్డుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారని చెప్పారు. మహానాడు వాహనాలకు గాలి తీసేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ‘‘జగన్ (Jagan)కు ఈ రోజు పిచ్చెక్కుతుంది. ఇవాళ నిద్ర పట్టదు. వైసీపీ నేతలు వెల వెల.. టీడీపీ (TDP) మీటింగులు కళ కళ. భవిష్యత్తులో ఎన్టీఆర్ (Ntr) రికార్డులను ఎవ్వరూ బద్దలు కొట్టలేరు. ఏడాది పాటు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు చేపడుతున్నాం. ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా జిల్లాల్లో మినీ మహానాడు కార్యక్రమాలు చేపడతాం.’’ అని చంద్రబాబు తెలిపారు.
Updated Date - 2022-05-29T00:47:57+05:30 IST