Somu Veerraju: అనుమతి తీసుకోను.. అడ్డుకోండి.. అరెస్ట్ చేయండి
ABN, First Publish Date - 2022-08-29T02:45:06+05:30
వినాయక చవితి మండపాల విషయంలో ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. వినాయక మండపం పెట్టాలంటే ఫైర్, విద్యుత్, పోలీస్ పర్మిషన్స్ తీసుకోవాలని..
విజయవాడ (Vijayawada): వినాయక చవితి (Vinayaka Chavithi) మండపాల విషయంలో ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Ap Bjp Chief Somu Veerraju) ఫైర్ అయ్యారు. వినాయక మండపం పెట్టాలంటే ఫైర్, విద్యుత్, పోలీస్ పర్మిషన్స్ తీసుకోవాలని చెబుతున్నారని.. ఇవి నిబంధనలు కావా? అని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ (Hyderabad)లో వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారని.. ఆ వేడుకలు చూసేందుకు ఎక్కడెక్కడ నుండో ప్రజలు తరలి వస్తారని.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Cm Jagan Mohan Reddy) అక్కడికి వెళ్లి అందులో పాల్గొంటే అప్పుడు ఆ ప్రాముఖ్యత తెలుస్తుందన్నారు.
ఏపీలో పెట్టిన నిబంధనలన్నీ వెంటనే తొలగించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. నిబంధనలు లేవంటూనే ఎన్నో నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. నిబంధనల పేరుతో పండుగని అడ్డుకుంటామంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ నిబంధనలు ఏమీ పట్టించుకోవద్దని సూచించారు. రాజమండ్రిలో వినాయక చవితి వేడుకల్లో తాను పాల్గొంటానని.. దానికి ఎలాంటి అనుమతులు తీసుకోనని.. దమ్ముంటే తనను అడ్డుకోవాలని..అరెస్ట్ చేయండని సోము వీర్రాజు సవాల్ విసిరారు.
Updated Date - 2022-08-29T02:45:06+05:30 IST