ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడేళ్లలో అమరావతి కట్టి తీరుతాం: సోము వీర్రాజు

ABN, First Publish Date - 2022-01-20T00:22:34+05:30

రాష్ట్ర రాజధాని అమరావతిని మూడేళ్లలో కట్టి తీరుతామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: రాష్ట్ర రాజధాని అమరావతిని మూడేళ్లలో కట్టి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. నగరంలో మీడియాతో ఆయన  మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయని వారి పింఛన్లను తీసేవేయడానికి వలంటీర్లను సీఎం జగన్కాపలా పెట్టాడని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోయినా ప్రధాని నరేంద్ర మోడీ వేల కోట్ల రూపాయల నిధులను ఏపీకి ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. మూడేళ్లలో జగన్ ఒక్క ఆర్ అండ్ బీ రోడ్డు కూడా వేయలేదని ఆయన విమర్శించారు.


అధికారంలోకి రాగానే పీఆర్సీ ఇస్తానని చెప్పాడని, కానీ ఇంతవరకు పూర్తిగా ఇవ్వలేదన్నారు. ఉద్యోగులకు జీతాలు లేవని, ఉద్యోగాలను పర్మినెంటు చేయలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ఉండవన్నారు. మూడేళ్లలో అమరావతి కట్టి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. పాలనలో జగన్ ప్రభుత్వం అన్ని విధాలా ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. 


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మతతత్వ పార్టీ అని ఆయన ఆరోపించారు. జగన్ ఆలోచన విధానాల వల్లే జిల్లాలోని ఆత్మకూరు అల్లర్ల ఘటన జరిగిందన్నారు. వైసీపీ మతతత్వ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో భారీ ఎత్తున నిరసన తెలియజేస్తామని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-01-20T00:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising