జంగారెడ్డిగూడెం సంఘటనపై చర్చ పెట్టాల్సిందే: టీడీపీ
ABN, First Publish Date - 2022-03-15T16:02:35+05:30
ఏపీ అసెంబ్లీ, శాసన మండలిలో జంగారెడ్డిగూడెం సంఘటనపై రగడ నెలకొంది.
అమరావతి: ఏపీ అసెంబ్లీ, శాసన మండలిలో జంగారెడ్డిగూడెం సంఘటనపై రగడ నెలకొంది. మంగళవారం ఉభయ సభలు ప్రారంభం కాగానే తెలుగుదేశం పార్టీ నేతలు జంగారెడ్డిగూడెం సంఘటనపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అలాగే మండలిలో కూడా ప్రతిపాదించారు. దీనికి స్పీకర్, మండలి ఛైర్మన్ అనుమతించలేదు. దీంతో టీడీపీ నేతలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. అటు శాసన మండలిలో కూడా సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. జంగారెడ్డిగూడెం సంఘటనపై చర్చ పెట్టాల్సిందేనని టీడీపీ నేతలు పట్టు పట్టారు. అయితే చర్చకు తిరస్కరించిన అధికార పక్షం... ప్రకటన చేస్తామని మంత్రులు అన్నారు.
Updated Date - 2022-03-15T16:02:35+05:30 IST