మీరు ఎమ్మెల్యేలా... ఇది మా కర్మ: స్పీకర్ తమ్మినేని
ABN, First Publish Date - 2022-03-16T15:08:01+05:30
ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనలపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఘటన ఏపీ అసెంబ్లీలో పెను దుమారాన్ని రేపుతోంది. బుధవారం ఉదయం సభ మొదలవగానే టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. జంగారెడ్డిగూడెం ఘటనపై చర్చ జరపాలంటూ తెలుగుదేశం నేతలు పట్టుబట్టారు. సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మూడు రోజుల టీడీపీ సభ్యులను గమనిస్తున్నా..దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు. సభలో ఏ భాషలో మాట్లాడాలో తెలియని మీరు ఎమ్మెల్యేలా.. ఇది మా కర్మ’’ అంటూ టీడీపీ సభ్యులపై స్పీకర్ మండిపడ్డారు. టీడీపీ సభ్యుల గందరగోళం నేపథ్యంలో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
Updated Date - 2022-03-16T15:08:01+05:30 IST