ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారింది: అనిత

ABN, First Publish Date - 2022-03-23T20:12:43+05:30

వైసీపీ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారిందని టీడీపీ నేత వంగలపూడి అనిత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. బుధవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి కల్తీ మద్యానికి మహిళల మాంగల్యాలు బలైపోతున్నాయని, జంగారెడ్డి గూడెంలో కల్తీసారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ప్రజల ప్రాణాలంటే వైసీపీ నేతలకు లెక్కలేదని విమర్శించారు. తండ్రి శవం పక్కనే సీఎం కుర్చీ కోసం సంతకాలు సేకరించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. కల్తీ సారా, జే బ్రాండ్లను ఓ పథకంలా అమలు చేస్తున్నారని ఆరోపించారు.


దిశా యాప్ తెచ్చి, దిశా పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభిస్తే అత్యాచారాలు ఆగిపోతాయా? అని అనిత ప్రశ్నించారు. నాటుసారా ప్రబలి నేరాలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వ ఉదాసీనత వల్ల మృగాళ్లు చెలరేగిపోతున్నారని అన్నారు. అసలు రాష్ట్రంలో మహిళా కమిషన్ పనిచేస్తోందా? అని నిలదీశారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని మహిళా హోంమంత్రి ఎందుకని అనిత మండిపడ్డారు. 

Updated Date - 2022-03-23T20:12:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising