Rayalaseemaలో రాజకీయం మారుతోందని జనం నాడి చెప్తోందా?
ABN, First Publish Date - 2022-05-19T01:06:34+05:30
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కడప జిల్లా కమలాపురం (Kamalapurm)లో ...
అమరావతి/హైదరాబాద్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కడప (Kadapa) జిల్లా కమలాపురం (Kamalapurm)లో పర్యటించారు. గురువారం కర్నూలు జిల్లా నంద్యాలలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్ననున్నారు. ఇందుకోసం టీడీపీ (TDP) కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే కడప జిల్లాలో చంద్రబాబుకు విశేష స్పందన లభించింది. జనాలు నీరాజనం పట్టారు. ఎక్కడికక్కడ భారీగా తరలివచ్చి చంద్రబాబుకు ప్రజలు అభివాదం తెలిపారు. గతం కంటే ఎక్కువగా ప్రజలు వస్తుండటంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ‘‘రాయలసీమలో రాజకీయం మారుతోందని జనం నాడి చెప్తోందా?. అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీకి వలసలుంటాయా?. కడపలో చంద్రబాబుకు జన నీరాజనం దేనికి సంకేతం?. టీడీపీ చరిత్రలో ఇంతటి స్పందన ఇంతకుముందు లేదా?. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుందనడానికి నిదర్శనమా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN ANDHRAJYOTHY) డిబేట్ (DEBATE) నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.
Updated Date - 2022-05-19T01:06:34+05:30 IST