ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కృష్ణా నదికి వరద ఉధృతి... అధికారుల అప్రమత్తం

ABN, First Publish Date - 2022-09-08T14:43:57+05:30

రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉధృతి అధికంగా ఉంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది (Krishna river)కి వరద ఉధృతి అధికంగా ఉంది. పులిచింతల (Pulichintala project) నుంచి ప్రకాశం బ్యారేజ్‌ (Prakasam barrage)కు  వరద ప్రవాహం పెరుగుతోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద రాత్రి లోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్  ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1.18 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద ముప్పు నేపథ్యంలో ముంపుకు గురికాబోయే ప్రభావిత ప్రాంత అధికారులు అప్రమత్తమయ్యారు. గణేష్ నిమజ్జనాల దృష్ట్యా అధికారులు అలెర్ట్ అయ్యారు. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. 


మరోవైపు పెన్నాకు వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ప్రవాహం  చేరుతోంది. దీంతో ముందస్తుగా అనంతపురం జిల్లాకు రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను విపత్తుల సంస్థ పంపించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద చేరే అవకాశం ఉంటే ముందుగానే సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని అధికారులు సూచించారు. 


Updated Date - 2022-09-08T14:43:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising