ఏపీ బీజేపీ కార్యాలయం వద్ద కోలాహలం
ABN, First Publish Date - 2022-03-10T18:34:09+05:30
ఏపీ బీజేపీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది.
విజయవాడ: ఏపీ బీజేపీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడంతో రాష్ట్ర బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు జరిపారు. నాయకులు స్వీట్లు పంచుతూ అభినందనలు తెలుపుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, పలువురు నాయకులు సంబరాలలో పాల్గొన్నారు. రాజధాని రైతులు... సోము వీర్రాజును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - 2022-03-10T18:34:09+05:30 IST