Visakhapatnamలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం పాట ప్రారంభం
ABN, First Publish Date - 2022-06-24T16:23:30+05:30
నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం పాట శుక్రవారం ఉధయం ప్రారంభమైంది.
విశాఖపట్నం: నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్(APL) ఆటగాళ్ల వేలం పాట శుక్రవారం ఉధయం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎల్ వేలంలో 368 ఆటగాళ్ళు పాల్గొంటారు. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆరు ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ పోటీ పడుతున్నాయి. ఐకాన్ ప్లేయర్గా కె ఎస్ భరత్, రిక్కీ భూయి, కె.వి శశికాంత్, అశ్విన్ హెబ్బర్, రషీద్ తదితరులు ఉన్నారు. ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ చారుశర్మ నేతృత్వంలో ఏపీఎల్ వేలం పాట జరుగుతోంది.
Updated Date - 2022-06-24T16:23:30+05:30 IST