ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాస్తవాలు కప్పిపుచ్చడానికే వైసీపీ ఎదురుదాడి

ABN, First Publish Date - 2022-05-22T06:33:35+05:30

కాకినాడ ఘటనపై టీడీపీ నిజనిర్ధారణకమిటీ సభ్యులు పర్యటిస్తే, వాస్తవాలు బయటపడతాయనే వైసీపీ నాయకులు ఎ దురుదాడి చేశారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి మద్దనకుంట ఈరన్న విమర్శించారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే ఈరన్న


మడకశిర టౌన, మే 21: కాకినాడ ఘటనపై టీడీపీ నిజనిర్ధారణకమిటీ సభ్యులు పర్యటిస్తే, వాస్తవాలు బయటపడతాయనే వైసీపీ నాయకులు ఎ దురుదాడి చేశారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి మద్దనకుంట ఈరన్న విమర్శించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్‌, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం మృతిపట్ల పలు అనుమానాలు ఉన్నాయన్నారు. హత్యా?, రోడ్డు ప్రమాదమా? వాస్తవాలు తెలుసుకోవడానికి తెలుగుదేశం పా ర్టీ  నిజనిర్ధారణ కమిటీ సభ్యులు వెళ్లారన్నారు. వైసీపీ నాయకులు అడ్డగించి దాడులకు దిగడం చూస్తుంటే, వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంద న్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరగకపోగా, దోషులపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవ న్నారు. అభివృద్ధిని విస్మరించి, కక్షతో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సుబ్రహ్మణ్యం మృతిపై వాస్తవాలు బయటకు తీసి, దోషులను కఠినం గా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. 


Updated Date - 2022-05-22T06:33:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising