ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-08-18T04:39:52+05:30

ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఐదు నెలలు కాపురం సజావుగా సాగింది.

జయశ్రీ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


లేపాక్షి, ఆగస్టు 17: ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఐదు నెలలు కాపురం సజావుగా సాగింది. ఆ తరువాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. పెళ్లయిన ఏడు నెలలకే ఓమహిళ ఆత్మహత్మ చేసుకుంది. ఈ సంఘటన లేపాక్షి మండలంలో బుధవారం చోటు చేసుకుంది. లేపాక్షి మండల కేంద్రానికి చెందిన వెంకటేశ, సునందమ్మల కుమార్తె జయశ్రీ(18).. అదే గ్రామానికి చెందిన నాగమ్మ, సంజీవప్పల కుమారుడు పవన ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ఏడు నెలల క్రితం వారి ప్రేమకు, పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో తల్లిదండ్రులను ఎదిరించి జయశ్రీ, పవనలు ప్రేమవివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి భర్త వద్దే ఉన్న జయశ్రీ ఉంటోంది. అయితే మొదటి ఐదు నెలల పాటు వారి కాపురం సజావుగానే సాగింది. తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు, గొడవలు తలెత్తాయి. రెండు నెలల నుంచి పుట్టింటికి వెళ్లాలని ఇద్దరి మధ్య తరచూ గొడవలు సాగేవని తెలిసింది. దీంతో మంగళవారం జయశ్రీ పుట్టింటికి వెళ్లింది. ఆ సమయలోఓ తండ్రి సరిగా మాట్లాడలేదని ఆమె మనోవేదనకు గురైంది. రాత్రి తిరిగి ఇంటికి వచ్చి మిద్దెపై నిద్రిస్తుండగా తెల్లవారుజాము జయశ్రీ కింద తనగదిలోకి వెళ్లింది. తలుపులు వేసుకుని తన చున్నితో ఫ్యానకు ఉరివేసుకుంది. 4గంటల సమయంలో భర్తలేచి కిందకు రాగా కిటికీలో నుంచి చూడగా అప్పటికే జయశ్రీ మృతి చెందింది. ఎస్‌ఐ మునీర్‌అహ్మద్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు జయశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తండ్రి వెంకటేశ ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2022-08-18T04:39:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising